జగన్ కేసుపై మాట్లాడడం తగదు: సిఎం కిరణ్ కుమార్

Kirankumar Reddy
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసు కోర్టు విచారణలో ఉందని, దానిపై మాట్లాడడం తగదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. వైయస్ జగన్ పెట్టుబడులపైనే సిబిఐ దర్యాప్తు జరుగుతోందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తప్పులు జరిగినట్లు విచారణలో తేలితే తదుపరి చర్యలుంటాయని ఆయన అన్నారు. సిబిఐ విచారణలో తాను జోక్యం చేసుకోబోనని ఆయన అన్నారు. తనకు తెలిసినంత వరకు సిబిఐ ఎఫ్ఐఆర్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి పేరు లేదని ఆయన అన్నారు. వైయస్సార్ జీవితాంతం కాంగ్రెసు పార్టీ కోసమే పనిచేశారని, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే వైయస్ ఆకాంక్ష అని ఆయన అన్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుల రాజీనామాల వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉందని ఆయన అన్నారు.

పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులపై తాను కేంద్ర మంత్రి జయంతీ నటరాజన్‌తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. వేయి కోట్ల రూపాయలతో స్త్రీనిధి ఏర్పాటు చేయాలని కోరినట్లు, దాని వల్ల మహిళలు మైక్రో ఫైనాన్స్ బారిన పడకుండా ఉంటారని చెప్పినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 7,300 టన్నుల ఎర్రచందనం నిల్వలన్నాయని, ఎర్రచందనం ఎగుమతికి అనుమతి కోరారని ఆయన అన్నారు. రాష్ట్రానికి రెండు బెటాలియన్ల బలగాలను కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినట్లు ఆయన తెలిపారు. దీపం పథకం కింద ఆరు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కోరినట్లు ఆయన చెప్పారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉందని, ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెసుదే విజయమని ఆయన అన్నారు. ఏ ఎన్నికల్లోనైనా గెలిచే సత్తా, బలం కాంగ్రెసుకు ఉన్నాయని ఆయన అన్నారు. 2014వరకు తమ ప్రభుత్వానికి ఢోకా లేదని ఆయన అన్నారు. ఆ తర్వాత కూడా కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+