సిఎం పదవి: చిరంజీవితో బొత్స సత్యనారాయణ పోటీ

పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెర మీదికి రావడానికి బొత్స సత్యనారాయణ చేయాల్సిందంతా చేస్తున్నారు. చిరంజీవి మాత్రం పూర్తిగా కాంగ్రెసు పార్టీ అధిష్టానం మీద ఆధారపడ్డారు. వచ్చే ఎన్నికల్లో చిరంజీవి కాంగ్రెసుకు స్టార్ కాంపైనర్ అవుతారనే మాట వినిపిస్తోంది. ఆ అవకాశాలు మెండుగానే ఉన్నాయి. కానీ, ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిరంజీవి పేరును పార్టీ అధిష్ఠానం ప్రకటిస్తుందా అనేది అనుమానమే. ఒకవేళ అలా ప్రకటించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే అడ్డుపడేవాళ్లు చాలా మందే ఉంటారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడంతో రెడ్లు కాంగ్రెసు పార్టీకి దూరమవుతున్నారనే అభిప్రాయం ఉంది. రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినా ఆ సామాజిక వర్గాన్ని కూడగట్టడంలో, వైయస్ జగన్ వైపు వెళ్లకుండా నిరోధించడంలో విఫలమయ్యారని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్థితిలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రత్యామ్నాయంగా కాపు సామాజిక వర్గాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో చిరంజీవికి, బొత్స సత్యనారాయణకు ప్రాధాన్యం లభించినప్పటికీ ముఖ్యమంత్రి పదవికి వచ్చేసరికి వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు విజయం సాధిస్తే మాత్రమే పోటీ పడడానికైనా అవకాశం ఉంటుందనేవారు కూడా ఉన్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ!












Click it and Unblock the Notifications