సిఎం పదవి: చిరంజీవితో బొత్స సత్యనారాయణ పోటీ

పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెర మీదికి రావడానికి బొత్స సత్యనారాయణ చేయాల్సిందంతా చేస్తున్నారు. చిరంజీవి మాత్రం పూర్తిగా కాంగ్రెసు పార్టీ అధిష్టానం మీద ఆధారపడ్డారు. వచ్చే ఎన్నికల్లో చిరంజీవి కాంగ్రెసుకు స్టార్ కాంపైనర్ అవుతారనే మాట వినిపిస్తోంది. ఆ అవకాశాలు మెండుగానే ఉన్నాయి. కానీ, ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిరంజీవి పేరును పార్టీ అధిష్ఠానం ప్రకటిస్తుందా అనేది అనుమానమే. ఒకవేళ అలా ప్రకటించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే అడ్డుపడేవాళ్లు చాలా మందే ఉంటారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడంతో రెడ్లు కాంగ్రెసు పార్టీకి దూరమవుతున్నారనే అభిప్రాయం ఉంది. రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినా ఆ సామాజిక వర్గాన్ని కూడగట్టడంలో, వైయస్ జగన్ వైపు వెళ్లకుండా నిరోధించడంలో విఫలమయ్యారని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్థితిలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రత్యామ్నాయంగా కాపు సామాజిక వర్గాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో చిరంజీవికి, బొత్స సత్యనారాయణకు ప్రాధాన్యం లభించినప్పటికీ ముఖ్యమంత్రి పదవికి వచ్చేసరికి వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు విజయం సాధిస్తే మాత్రమే పోటీ పడడానికైనా అవకాశం ఉంటుందనేవారు కూడా ఉన్నారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications