బొత్సపై విరుచుకుపడిన జగన్ పార్టీ నాయకులు

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద జగన్ పేరు చెప్పుకొని సీఎం కిరణ్కుమార్రెడ్డి, బొత్సలు బతుకుతున్నారని ఆయన విమర్శించారు.. సీఎం, బొత్సల మధ్య నెలకొన్న అంతర్గత పోరుతో ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని ఆయన అన్నారు.
పీసీసీ అధ్యక్షుడు బొత సత్యనారాయణ వ్యాఖ్యలపై రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. వారసత్వ రాజకీయాలకు కేంద్రబిందువు కాంగ్రెస్ పార్టీయేనని ఆయన మంగళవారం అనంతపురంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఇందిరాగాంధీ నుంచి సోనియా గాంధీ వరకూ అందరూ రాజకీయ వారసులేనని కాపు రామచంద్రారెడ్డి గుర్తు చేశారు. బొత్స ఒక అవినీతిపరుడని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బొత్స కుటుంబంలో ఎంతమందికి పదవులున్నాయో గుర్తు చేసుకోవాలని రామచంద్రారెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications