ఆస్తులపై వైయస్ జగన్‌కు చంద్రబాబు చురక!

Chandrababu Naidu
హైదరాబాద్: చట్ట వ్యతిరేకతను చట్టబద్దంగా మార్చుకొని బాగా సంపాదించుకున్న నేతలు రాజకీయాల్లో ఉన్నారని తాను మాత్రం అలా చేయలేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి శుక్రవారం చురక వేశారు. తన ఆస్తులు ప్రకటించుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తుల సంపాదనలో ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఎన్నికల సంస్కరణలు వస్తే బ్లాక్ మనీ అంతమవుతుందన్నారు. రాజకీయాల్లో ఆదర్శం కోసం మొట్టమొదటిసారి తాను ఆస్తులు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. హైటెక్ సిటీ కట్టక ముందే తనకు అక్కడ మూడెకరాల భూమి ఉందన్నారు. కావాలని కొందరు, కొన్ని పత్రికలు తనపై బురద జల్లుతున్నాయన్నారు.

తాను ఏం చేసినా రాష్ట్ర ప్రజల కోసమే చేశానని అన్నారు. రాజకీయాల్లో మంచి విలువల కోసం ఆస్తులు ప్రకటించినట్లు చెప్పారు. హెరిటేజ్‌ల తమ వాటా 45 శాతం అని చెప్పారు. తన తనయుడు లోకేష్ కుమార్ పేరిట రూ.7కోట్లు, కోడలు బ్రాహ్మిణి పేరిట రూ.3కోట్లు ఉన్నట్లు చెప్పారు. భార్య భువనేశ్వరి పేరిట రూ.12 కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. తనకు ఓ అంబాసిడర్ కారు ఉందన్నారు. తన వ్యవసాయ భూమిని బంధువులకు ఉచితంగా ఇచ్చానని చెప్పారు. తమ కుటుంబమంతా కష్టజీవులమన్నారు. ఎవ్వరూ ఇంటి వద్ద ఉండరన్నారు. అందరూ కష్టించి పని చేస్తారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+