నెలాఖరున మంత్రి పదవికి జానా రెడ్డి రాజీనామా?

ఈ నెల 25వ తేదీన తెలంగాణ అంశాన్ని తేల్చాలని కోరడానికి కాంగ్రెసు తెలంగాణ నాయకులతో పాటు ఆయన కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన 25వ తేదీ సాయంత్రం స్వదేశానికి రావచ్చునని అంటున్నారు. ఇతర ముఖ్య నాయకులు కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ స్థితిలో ఈ నెలాఖరున తెలంగాణపై పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఈ నెలాఖరున పార్టీ అధిష్టానం ఏమీ తేల్చకపోతే రాజీనామా చేయాలని జానా రెడ్డి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇది వరకే తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2వ తేదీన మంత్రి పదవికి రాజీనామా చేసి తాను ఆమరణ నిహారారదీక్షకు దిగుతానని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో జానా రెడ్డి కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications