పైన ఒకరితో కింద ఒకరితో కాపురం: టిడిపి నేతలు

telugudesam party
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెసు పార్టీ మంచం పైన ఒకరితో కింద ఒకళ్లతో కాపురం చేసే వైఖరి మానుకోవాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు లింగారెడ్డి శనివారం హెచ్చరించారు. తెలంగాణ అంశంపై ఆ పార్టీ వైఖరి ఏమిటో తెలియనందు వల్లే రాష్ట్రంలో ఉద్యమాలు, అనిశ్చితి నెలకొందని విమర్శించారు. కొత్త రాష్ట్రాల కోసం దేశమంతటా డిమాండ్లున్నా కాంగ్రెసు పార్టీ ఈ ఒక్క రాష్ట్రంలోనే ప్రజలకు కాల్చుకు తింటోందన్నారు. అసెంబ్లీ తీర్మానంతోనే గతంలో రెండు ప్రాంతాలు కలిశాయని ఇప్పుడూ విభజన కావాలనుకుంటే తీర్మానంతోనే సాధ్యమన్నారు. తీర్మానం లేకుండా విభజన అసాధ్యమన్నారు.

రాష్ట్ర విభజనపై ఏ అఖిలపక్ష సమావేశాలకు తాము వెళ్లమని మరో నేత యనమల రామకృష్ణుడు వేరుగా అన్నారు. తమ పార్టీలోని రెండు ప్రాంతాల నేతలు ఇంతకుముందే సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తెలంగాణ నగారా సమితి చైర్మన్ నాగం జనార్ధన్ రెడ్డి సైతం అప్పుడు పార్టీలోనే ఉన్నారన్నారు. శ్రీకృష్ణ కమిటీ, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ నివేదికలపై ఏ నిర్ణయం తీసుకునేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాల్సి ఉంటుందన్నారు. తమ పార్టీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేయడంలో తప్పు లేదని వారి ప్రాంతీయ పరిస్థితిలకు అనుగుణంగా రాజీనామా చేశారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+