కిరణ్ వైఖరితో జగన్ వర్గ ఎమ్మెల్యేల ఇబ్బందులు

బుధవారం నుండి ప్రారంభమైన రచ్చబండ కార్యక్రమం ద్వారా వారు మరింత ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొంటారు. అయితే ఇప్పుడు జరిగే రచ్చబండలో జగన్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వకుండా స్థానిక మంత్రులే కార్యక్రమాన్ని చక్కబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల్లోకి బాగా వెళుతున్న రచ్చబండ కార్యక్రమం విషయంలో తమను దూరంగా పెడతారనే విషయాన్ని జగన్ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక పోతున్నట్లుగా సమాచారం. ఎమ్మెల్యేల స్థానంలో ప్రత్యామ్నాయంగా నియమించిన ఇంచార్జులకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారట. తమను దూరం పెట్టే అంశంపై జగన్ ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నిస్తున్నారట.












Click it and Unblock the Notifications