వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌తో పోటీ పడాలనుకుంటున్నారు: జూపూడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jupudi Prabhakar Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రా రావు, శాసనమండలి సభ్యుడు జూపూడి ప్రభాకర రావు ఆదివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జయభేరీ, మధుకాన్, మార్గదర్శి తదితర సంస్థల్లో బాబుకు పార్ట్‌నర్‌షిప్ లేదా అని జూపూడి ప్రశ్నించారు. జగన్‌తో పోటీ పడి జిల్లాల్లో తిరగాలని బాబు అనుకుంటున్నారన్నారు. బాబు దొంగలకు దొంగ, మోసగాళ్లకు మోసగాడు బాబు అన్నారు. బాబు చరిత్ర అందరికీ తెలుసన్నారు. బాబుకు ఎంతమంది బినామీలు ఉన్నారో చెప్పాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిచినప్పుడు బాబుని చూసి సిగ్గుపడుతున్నానని ఆయన ఆవేదన చెందారన్నారు. బాబు ఇంట్లో 18 గదులు లేవా అని ప్రశ్నించారు.

ఓఎంసికి భూములు కేటాయించిన బాబును సిబిఐ ఎందుకు ప్రశ్నించడం లేదని గట్టు ప్రశ్నించారు. జగన్‌ను విచారించడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. విచారణకు బాబు ఎందుకు భయపడుతున్నారన్నారు. కోనేరు ప్రసాద్‌ను అరెస్టు చేశాక కూడా బాబును విచారించలేదంటే అసలు విషయం అందరికీ అర్థమవుతోందన్నారు. సిబిఐ విచారణ అంశాలు ఎల్లో మీడియాకు ఎలా తెలిశాయని ప్రశ్నించారు. ఇంతకుముందు కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా ఉన్న సిబిఐ ఇప్పుడు చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిందా అని ప్రశ్నించారు. బాబు అబద్దాల ఫ్యాక్టరీతో గడుపుతున్నారన్నారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు.

English summary
YSRC Party camp MLA Jupudi Prabhakar Rao blamed TDP chief Nara Chandrababu Naidu for his attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X