తప్పును వైయస్ ప్రభుత్వంపైకి నెడుతున్న రాజగోపాల్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: గనుల లీజు వ్యవహారాలను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ విడి రాజగోపాల్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పైకి నెడుతున్నారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్డన్ రెడ్డికి గనులను లీజుకు ఇవ్వడంలో తాను ఏ విధమైన అక్రమాలకు పాల్పడలేదని ఆయన ఓ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. గాలి జనార్దన్ రెడ్డికి గనులను లీజుకు ఇవ్వడంలో ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలు ఒత్తిడి తెచ్చారని, దాంతో గాలి జనార్దన్ రెడ్డికి లీజులు మంజూరు చేయక తప్పలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకే లీజుల ఖరారు ప్రభుత్వం ఆదేశాల మేరకే జరిగిందని ఆయన చెప్పారు.

గాలి జనార్దన్ రెడ్డి తనపై ఏ విధమైన ఒత్తిడి పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. అప్పటి గనుల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి కూడా ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి గురయ్యారని ఆయన చెప్పారు. మైనింగ్ కాంట్రాక్టర్ శశికుమార్ చేసిన ఆరోపణల్లో ఏ విధమైన వాస్తవం లేదని ఆయన అన్నారు. తాను ఒక్క పైసా లంచం అడగలేదు, తీసుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని గనులను కాపాడడంలో తాను ప్రధాన పాత్ర పోషించానని ఆయన చెప్పారు. రాష్ట్రానికి యేటా 300 కోట్ల రూపాయల రెవెన్యూ సమకూరేలా తాను కృషి చేశానని ఆయన చెప్పారు. గనుల లీజుకు దరఖాస్తు చేసుకున్నవారిలో కొండారెడ్డి 15వ వ్యక్తి అని ఆయన అన్నారు. గనుల లీజు విషయంలో పరిశ్రమలు పెట్టేవారికి ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రభుత్వ ఉద్దేశం వల్ల గాలి జనార్దన్ రెడ్డికి లీజు దక్కినట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+