గాలి గనుల కేసు: కొండారెడ్డికి టు ప్లస్ టు భద్రత

గాలి గనుల అక్రమాలపై కేసును సిబిఐ అధికారులు దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా కొండారెడ్డి తెర పైకి వచ్చారు. సిబిఐ ముందు ఆయన ఇచ్చిన వాంగ్మూలం కేసుకు చాలా ప్రధానమని తెలుస్తోంది. ఓఎంసికి కేటాయించిన గనుల కోసం గాలి కంటే తానే ముందు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అప్పటి ప్రభుత్వ పెద్దల అండతో తనను బెదిరించి తనకు గనుల కేటాయింపు జరగకుండా చేశారని ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ విచారించినప్పుడు కూడా కొండారెడ్డి సిబిఐ కార్యాలయంలోనే పక్క గదిలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. జగన్ ఒత్తిడి తెచ్చి గనులు గాలికి దక్కేటట్లుగా చూశారని ఆయన సిబిఐకి చెప్పారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications