శ్రీలక్ష్మి విచారణను తొందరగా ముగించిన సిబిఐ

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమాల కేసులో సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి మరోసారి శనివారం ఉదయం హాజరయ్యారు. కాగా, గాలి జనార్దన్ రెడ్డి కేసులో నాలుగో నిందితురాలైన శ్రీలక్ష్మి అరెస్టుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటీవల సిబిఐ తొమ్మిది గంటల పాటు శ్రీలక్ష్మిని ప్రశ్నించింది. ఆ రోజే ఆమెను సిబిఐ అరెస్టు చేస్తుందని భావించారు. కానీ అది జరగలేదు. తాను అరెస్టు కాకుండా శ్రీలక్ష్మి తీవ్ర ప్రయత్నాలే చేశారని ప్రచారం జరుగుతోంది. కేసులో అప్రూవర్గా మారుతానని ఆమె చెప్పారని వార్తలు వస్తున్నాయి. శ్రీలక్ష్మికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు మాట్లాడని మరో ఐఎఎస్ అధికారి రాజగోపాల్ శుక్రవారం తప్పునంతా ఆమెపైనే వేసినట్లు వార్తలు వచ్చాయి.
ఢిల్లీ నుంచి ఒత్తిళ్లు రావడం వల్లనే సిబిఐ ఆమె అరెస్టుపై ఇటీవల వెనక్కి తగ్గినట్లు ఓ వార్తాపత్రిక రాసింది. దాంతో పాటు శ్రీలక్ష్మిని అరెస్టు చేయడం కన్నా అప్రూవర్గా మార్చుకుంటే పెద్దల గుట్టు బయటపడుతుందని సిబిఐ ఆలోచనగా చెబుతున్నారు. బ్రాహ్మణి స్టీల్స్కు కాప్టివ్ మైన్గా ఖనిజాలను వాడాలనే పదం ఏ దశలో జీవో నుంచి మాయమైందో తనకు తెలియదని ఆమె అంటున్నారు. బ్రాహ్మణి స్టీల్స్కు కాప్టివ్ మైన్గా వాడడానికి అప్పటి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఓబుళాపురం గనులను గాలి జనార్దన్ రెడ్డికి ఇచ్చింది. అయితే, జీవోలో ఆ పదం మాయం కావడంతో గాలి జనార్దన్ రెడ్డి ఇనుప ఖనిజాన్ని యధేచ్ఛగా ఎగుమతి చేశారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల కారణంగానే గాలి జనార్దన్ రెడ్డికి గనులను లీజుకు ఇవ్వాల్సి వచ్చిందని కూడా శ్రీలక్ష్మి సిబిఐ ముందు చెప్పినట్లు తెలుస్తోంది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications