విజయమ్మ పిటిషన్పై సుప్రీంకు రామోజీ, టిడిపి నేతలు
హైకోర్టు ఆదేశాలను తాను సుప్రీంకోర్టులో సవాల్ చేయబోనని చంద్రబాబు నాయుడు ఆదివారం ఢిల్లీలో చెప్పారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర రావు, సుజనా చౌదరి, పార్టీ నాయకుడు సిఎం రమేష్ వ్యక్తిగతంగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విజయమ్మ పిటిషన్పై రామోజీ రావుతో పాటు తెలుగుదేశం నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వచ్చాయి.
చంద్రబాబుకు చెప్పిన తర్వాతనే ముగ్గురు తెలుగుదేశం నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, ప్రభుత్వం నుంచి తాను ఎటువంటి కాంట్రాక్టులూ పొందలేదని సుజనా చౌదరి మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను 25 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నానని, ఏ రోజు కూడా తప్పు చేయలేదని ఆయన అన్నారు. సిబిఐ విచారణ తర్వాత పాలేవో, నీళ్లేవో తేలిపోతాయని కూడా ఆయన అన్నారు. సిబిఐ విచారణను ఎదుర్కుంటారా అని అడిగితే సిబిఐ వాళ్లు కూడా మనుషులేనని, దయ్యాలూ భూతాలూ కారని ఆయన సమాధానమిచ్చారు. వ్యక్తిగతంగా అయితే తాను సుప్రీంకోర్టుకు వెళ్లేవాడిని కానని, కంపెనీ లా బోర్డు ప్రకారం వెళ్లాల్సి వస్తోందని ఆయన అన్నారు. కాగా, వైయస్ విజయమ్మ సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు చేశారు.