హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి జనార్ధన్ ఎఫ్ఐఆర్ కొట్టివేత కేసు 28కి వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఎఫ్ఐఆర్ కేసును కోర్టు ఈ నెల 28వ తేదికి వాయిదా వేసింది. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టి వేయాలంటూ గాలి జనార్ధన్ రెడ్డి ఇటీవల కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. గురువారం విచారించిన కోర్టు కేసును వాయిదా వేసింది. కాగా గాలి జనార్ధన్ రెడ్డి, ఓఎంసి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలకు చంచల్ గూడ జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. గాలి కేసు విచారణ పూర్తి కావొచ్చింది.

కాగా గాలి ఓఎంసి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు రాజగోపాల్, శ్రీలక్ష్మిలపై పలువురు మైనింగ్ కంపెనీ యజమానులు సిబిఐకు ఫిర్యాదు చేస్తున్నారు. వారు అవినీతి అధికారులని, వారిని విచారిస్తే మరిన్ని అక్రమాలు బయటపడతాయని పలువురు యజమానులు ఫిర్యాదు చేయటం ద్వారా వారు కేవలం ఓఎంసిలో మాత్రమే కాకుండా పలు మైనింగ్ కార్యకలాపాల్లో అక్రమాలకు పాల్పడినట్లుగా కనిపిస్తోంది.

English summary
Karnataka former minister Gali Janardhan Reddy FIR case adjourned to 28th this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X