Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాక్సైట్ ఆందోళనలో చిక్కుకున్న మంత్రి బాలరాజు

Balaraju
విశాఖపట్నం: బాక్సైట్ వ్యతిరేక ఆందోళనలో మంత్రి బాలరాజు చిక్కుకుపోయారు. ఆందోళన కారణంగా బాలరాజు ఎటూ కదలలేకపోయారు. సర్య్యూట్ హౌస్ వైపు వెళ్లే దారిని మూసేయడంతో కిలోమీటరు దూరం వెళ్లడానికి అర గంటకుపైగా సమయం పట్టింది. దీంతో మంత్రి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీగా ఉన్న స్థానిక పోలీసులను వెనక్కి పంపించేశారు. ఆందోళనతో గురువారం ఉదయం విశాఖపట్నం ప్రభుత్వం అతిథి గృహం వద్ద గురువారం ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బాక్స్టైట్ నిక్షేపాల అధ్యయన కమిటీ నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణను వామపక్షాల కార్యకర్తలు, గిరిజన ప్రతినిధులు అడ్డుకున్నారు. వారిని పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారున. అయితే విడతలవారీగా వచ్చిన ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు.

కేంద్ర కమిటీ పర్యటనను గత మూడు రోజులుగా ప్రతిపక్షాల కార్యకర్తలు, గిరిజనులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ చింతపల్లి అటవీ ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు జరపకూడదని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ ప్రాంతంలో బాక్సైట్, చైనా క్లే నిక్షేపాలు పెద్ద యెత్తున ఉన్నాయనే సమాచారంతో ఆందోళనలను లెక్క చేయకుండా ప్రభుత్వం ఏరియల్ సర్వే కూడా నిర్వహించింది. పరిస్థితిని అంచనా వేసిన కమిటీ గురువారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండండతో విశాఖపట్నంలోనే కమిటీ ప్రజాభిప్రాయ సేకరణకు పూనుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+