తెలంగాణపై మమ్మల్ని టార్గెట్ చేయొద్దు: సిపిఎం ఏచూరి

Sitaram Yechury
ఖమ్మం: తెలంగాణ అంశం విషయంలో తమ పార్టీని టార్గెట్ చేయవద్దని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి శుక్రవారం అన్నారు. ఖమ్మంలో జరుగుతున్న 23వ సిపిఎం రాష్ట్ర మహాసభలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణపై తమ వైఖరి మార్చుకోవాలని సూచించడం సరికాదన్నారు. చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ధి జరగదన్నారు. తెలంగాణపై మా పార్టీ నిర్ణయాన్ని ఇప్పటికే చెప్పేశామన్నారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని ఆయన స్పష్టం చేశారు. యుపిఏ-2 పూర్తి అవినీతిమయ ప్రభుత్వమన్నారు. 2జి లైసెన్సుల రద్దుతో అది రుజువైందన్నారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమన్నారు. ప్రజా సమస్యలే తమ అజెండా అన్నారు. ప్రతిఫలం ఆశించకుండా ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామన్నారు.

2జి కుంభకోణం కేసులో సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామన్నారు. ఈ కేసులో లైసెన్సులను రద్దు చేయడంతో సరి పెట్టవద్దని, డబ్బును రికవరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై రెండు విధాలుగా వెళుతున్న పార్టీలు కలవడం కాస్త కష్టమే కావచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఈ సభలో సిపిఎం రాష్ట్ర మహా సభల్లో రెండో రోజు ఉదయం జరిగిన చర్చల్లో మూడు తీర్మానాలను ఆమోదించారు. రాష్ట్రంలో జరుగుతున్న జూనియర్ డాక్టర్ల, 104 ఉద్యోగుల సమస్యలు తీర్చాలని, యానాం రీజెన్సీ కార్మికులపై నిర్బంధాన్ని తొలగించాలని, లాకౌట్ ఎత్తి వేయాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మూడు తీర్మానాలు ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+