ఆ మాట వైయస్ జగన్ ఎప్పుడో చెప్పారు: సబ్బం హరి

పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశం ఏ విధమైన ప్రయోజనం ఇవ్వదని ఆయన అన్నారు. రైల్వే బడ్జెట్ దాదాపు తుది మెరుగులు దిద్దుకున్న తర్వాత ఇప్పుడు ప్రతిపాదనలు చేయడం ఏమిటని ఆయన అడిగారు. ఏ విధమైన ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతోనే తాను ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన పార్లమెంటు సభ్యుల సమావేశానికి వెళ్లలేదని ఆయన అన్నారు. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంటులో ప్రస్తావించడానికి ప్రయత్నిస్తే కాంగ్రెసు నాయకులే అడ్డుకున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications