జగన్ సేవలో సిఎం కిరణ్, వారు కవలలు: రేవంత్ రెడ్డి
జగన్పై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ దగ్గర ఉన్న శాఖను తీసివేశారని ఆరోపించారు. సరస్వతి పవర్ సంస్థ పేరు మీద జగన్ అక్రమంగా తనకు తాను కేటాయించుకున్న సున్నపు రాయి గనులను రద్దు చేయాలన్న ప్రతిపాదన మూడు నెలలుగా సిఎం అనుమతి కోసం ఎదురుచూస్తోందని చెప్పారు. ఓబుళాపురం గనుల వ్యవహారాల్లో జగన్ బెదిరించారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వరద రాజుల రెడ్డి కొడుకు కొండా రెడ్డి ఫిర్యాదు చేసినా ఆ కేసులో జగన్ను చేర్చలేదని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎపిఐఐసి చైర్మన్గా ఉన్నప్పుడే ఎమ్మార్ స్కాం జరిగినా కేసు పెట్టలేదన్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వం పట్ల అవిశ్వాసం వ్యక్తం చేస్తూ ఓటు వేసినా వారి పదవులు పోకుండా కిరణ్ కాపాడుతున్నారని, ఎక్కడో స్పీకర్ను ఏదో ఒక మాట అన్నారని టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాం సభ్యత్వం రద్దు చేయించిన కాంగ్రెస్ నేతలు జగన్ వర్గం ఎమ్మెల్యేల జోలికి వెళ్ళకుండా ఉండటం వెనక సీఎం జోక్యం లేదా అని ప్రశ్నించారు.
కాగా, లిక్కర్ సిండికేట్ నుంచి ముడుపులు పుచ్చుకొన్నారంటూ మంత్రి మోపిదేవి వెంకట రమణపై ఎసిబి కోర్టులో నివేదిక దాఖలు చేసినా ఆయనను పదవి నుంచి సిఎం తప్పించక పోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి తప్పు చేశారనుకొంటే ఆయనను తప్పించాలని, లేదా ఎసిబి అధికారులు మంత్రిని అన్యాయంగా బదనాం చేశారనుకుంటే వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పు చేసి ఉండాలని, కాని ఎవరిపైనా చర్య తీసుకోకుండా ముఖ్యమంత్రి మౌనంగా కూర్చుంటే చాలదన్నారు.