జగన్ కేసు: వైయస్ వద్ద పనిచేసిన సిఎఎస్ల విచారణ

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఐదుగురు సీనియర్ ఐఎఎస్ అధికారులు ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. మోహన్ కందా, టికె దివాన్, హరినారాయణ, రఘోత్తమ రావు, రమాకాంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. వైయస్ హయాంలో చివరగా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రమాకాంత్ రెడ్డిని సిబిఐ తొలుత విచారించింది. గురువారంనాడు సిబిఐ ముందు హాజరైన రఘోత్తమ రావు ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేయడానికి ముందు భూపరిపాలన శాఖ కమిషనర్గా పనిచేశారు. ప్రధాన కార్యదర్శిగా, భూపరిపాలన శాఖ కమిషనర్గా జారీ చేసిన ఉత్తర్వులపై సిబిఐ రఘోత్తమరావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వైయస్ హయాంలోని భూకేటాయింపులపై సిబిఐ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications