ఆనంకే చెమటలు, ప్రజల కళ్లు తిరగడం ఖాయం: శోభా

బడ్జెట్ అప్పు చేసి పప్పు కూడు తిన్నట్లుగా ఉందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బడ్జెట్లో పన్నుల భారం చూపించలేదని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. బయట విధిస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్లో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారన్నారు. ఆరోగ్యం విషయంలో రాష్ట్రం అట్టడుగు స్థానంలో ఉందన్నారు. రూ.1.45 లక్షల కోట్లలో స్థానిక సంస్థలకు రూ.600 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. బడ్జెట్ ప్రజలకు పనికొచ్చేదిగా లేదని సిపిఐ నేత గూండా మల్లేషం అన్నారు. బడ్జెట్ అంకెల గారడిగా ఉందని, ప్రాధాన్యతా రంగాలకు కోత విధించారని తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు.












Click it and Unblock the Notifications