కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీ నేత అనుచరుడి కుటుంబం దారుణ హత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kurnool
కర్నూలు: జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ పడగ విప్పింది. కర్నూలు జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత భూమా నాగి రెడ్డి అనుచరుడిని ప్రత్యర్థులు శుక్రవారం రాత్రి హతమార్చారు. జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం చిన్నచింతకుంట గ్రామంలో శుక్రవారం రాత్రి భూమా ముఖ్య అనుచరుడు కృష్ణారెడ్డి కుటుంబంలో ముగ్గురితో పాటు మరొకరు బలయ్యారు. కృష్ణారెడ్డి కుటుంబం నిద్రిస్తుండగా ప్రత్యర్థులు కారంపొడి చల్లి వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో కృష్ణా రెడ్డి, అతడి భార్య గోవిందమ్మ, దుబ్బోదు మృతి చెందారు.

కృష్ణా రెడ్డి కొడుకు మల్లికార్జున రెడ్డి, మామ రామసుబ్బారెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కాగా ఈ ఘటనకు పాతకక్షలు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

English summary
YSR Congress Party leader Bhooma Nagi Reddy's follower family dead on friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X