ముఖ్యమంత్రి బుజ్జగింపులతో వెనక్కి తగ్గిన విజయలక్ష్మి

కాగా మహబూబ్ నగర్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజేశ్వర రెడ్డి ఇటీవల మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది ఆయన కాంగ్రెసు పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ మృతి చెందారు. కాంగ్రెసు పార్టీ తరఫున ఆయన సతీమణి విజయలక్ష్మికి టిక్కెట్ ఇవ్వాలని మొదట భావించింది. అయితే పార్టీ నేత ముత్యాల ప్రకాశ్ ఎదురు తిరిగారు. విజయలక్ష్మికి టిక్కెట్ ఇస్తే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దింపుతామని హెచ్చరించారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు తదితర అంశాల కారణంగా చివరి నిమిషంలో పార్టీ అధిష్టానం టిక్కెట్ విజయలక్ష్మికి కాకుండా ప్రకాశ్కు ఇచ్చింది. దీంతో విజయలక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు సిద్ధపడింది. అయితే ముఖ్యమంత్రి పలుమార్లు ఆమెతో భేటీ అయి బుజ్జగించారు.












Click it and Unblock the Notifications