వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూరిని టిడిపి అండతోనే భాను చంపేశాడు: భానుమతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gangula Bhanumati
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అండతోనే తన భర్త మద్దెలచెర్వు సూరిని ఆయన ప్రధాన అనుచరుడు భానుకిరణ్ హత్య చేశారని సూరి సతీమణి గంగుల భానుమతి ఆదివారం ఆరోపించారు. ఆమె గుంటూరు జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. భాను ఒక్కడికే అంత ధైర్యం లేదన్నారు. పార్టీలో కష్టపడి పని చేస్తున్నానని ఆమె చెప్పారు. త్వరలో పార్టీ తరఫున ప్రజల్లోకి వెళతానని ఆమె స్పష్టం చేశారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసును ఛేదించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు. భానును త్వరగా పట్టుకొని శిక్షించాలని ఆమె అన్నారు.

కాగా గత సంవత్సరం జనవరిలో మద్దెలచెర్వు సూరి హైదరాబాదులో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన అనుచరుడు భాను కిరణ్‌నే పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఆయనే ప్రధాన నిందితుడు. అయితే సూరి హత్య అనంతరం భానుకిరణ్ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇప్పటి వరకు అతన్ని పోలీసులు పట్టుకోలేదు. కొన్నిసార్లు భాను కిరణ్ గోదావరి జిల్లాల్లో కనిపించాడని, చిత్తూరు జిల్లాలో కనిపించాడని, లొంగిపోయేందుకు సిద్దమయ్యాడని వార్తలు కూడా వచ్చాయి.

English summary
Maddelachervu Suri wife Gangula Bhanumati accused that Bhanu Kiran killed her husband with TDP support.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X