చిరునవ్వుతో రైల్వే బడ్జెట్ ప్రవేశ పెడుతున్నా: త్రివేది

న్యూఢిల్లీ: తాను చిరునవ్వుతో రైల్వే బడ్జెట్ ప్రవేశ పెడుతున్నానని కేంద్ర రైల్వే మంత్రి దినేష్ త్రివేది బుధవారం అన్నారు. బడ్జెట్ సామాన్యులకు అనుకూలంగా ఉంటుందని ఆయన చెప్పారు. రైల్వే ప్రగతి పైనే దేశాభివృద్ధి ఉందని ఆయన అన్నారు. భారతీయ రైల్వే బంగారం లాంటిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా దినేష్ త్రివేది మొదటిసారి రైల్వే బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఛార్జీలను పెంచని రైల్వే ఈసారి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభివృద్ధి సుంకం పేరుతో కొత్తగా పన్నులు విధించే అవకాశం ఉంది. ఈసారి ప్రత్యక్ష, పరోక్ష వడ్డింపులు ఉంటాయని అంటున్నారు.
కాగా త్వరలో జరగనున్న రాష్ట్రాల్లో పలు రైళ్లు ఆగే అవకాశం కనిపిస్తోంది. సొంత రాష్ట్ర పశ్చిమ బెంగాల్తో పాటు గుజరాత్ వంటి రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు జరిపే అవకాశముంది. నూతన బడ్జెట్లో సాధారణ ప్రయాణీకులపై ఛార్జీల భారం ఉండకపోయినప్పటికీ ఉన్నత తరగతులపై ఛార్జీలు పెంచే అవకాశముంది. రైల్వే సర్వీసుల్లోనూ మార్పులు చేసే అవకాశముంది. కాగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు త్రివేది బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఆయన ఇప్పటికే పార్లమెంటుకు చేరుకున్నారు. లోకసభలో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత స్పీకర్ సభను 12 గంటలకు వాయిదా వేశారు.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications