ఇంటర్ ఫిజిక్స్ పేపర్: తప్పు లేదన్న మంత్రి పార్థసారథి

అదనపు మార్కులు కలిపేది లేదని మంత్రి తేల్చి చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం లేదని, ఫేయిల్ అయిన విద్యార్థులు ఎంసెట్ పరీక్ష రాయవచ్చని, అయితే సప్లమెంటరీ పరీక్షలో విద్యార్థులు పాసవ్వాలని మంత్రి తెలిపారు. అప్పుడు అకడమిక్ ఇయర్ కోల్పోరని ఆయన చెప్పారు. గత ఐదేళ్లలో వచ్చిన పేపర్ ఆధారంగా పలు విద్యా సంస్థలు విద్యార్థులను ప్రిపేర్ చేశాయని చెప్పారు. అది సరికాదన్నారు.
పాఠ్య పుస్తకాన్ని ఆసాంతం అవగతం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇంటర్ బోర్డుపై తప్పుడు ప్రచారం మానుకోవాలని ఆయన సూచించారు. మొత్తం 21వ ప్రశ్నలలో పదహారు ప్రశ్నల బ్లూ ప్రింట్లోనివే అన్నారు. మిగిలిన కొన్ని ప్రశ్నలు మాత్రమే పుస్తకం నుండి ఇచ్చినట్లు చెప్పారు. ప్రశ్నా పత్రం సరిగా లేదనడం సరికాదన్నారు. ఇక నుండి ఇంటర్ బోర్డు పాఠ్య పుస్తకాల నుండే ప్రశ్నలు ఇస్తుందని చెప్పారు.
2008 నుంచే బ్లూ ప్రింట్ ఆధారంగా ప్రశ్నలు ఇచ్చే సంస్కృతి పోయిందన్నారు. ఇక టెక్స్ట్ బుక్స్కే ప్రాధాన్యం అని చెప్పారు. పరీక్షలో సిలబస్లో లేని ప్రశ్నలు అడగలేదని, కావాలంటే నిరూపించేందుకు సిద్ధమన్నారు. ఫెయిలైన విద్యార్థులు ఆందోళన చెందకుండా తదుపరి పరీక్షలకు ప్రిపేర్ కావాలని సూచించారు. కాగా అంతకుముందు పార్థసారథి ఇంటర్ బోర్డు అధికారులతో చర్చించారు.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications