కోట్లు వైయస్ జగన్‌కు, కోర్టులు మాకు: మంత్రి ధర్మాన

Dharamana Prasad Rao
శ్రీకాకుళం: అక్రమ వ్యాపారాలు చేస్తూ కోట్లాది రూపాయలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంపాదించారని, జగన్ చేసిన తప్పులకు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు కోర్టులకు వెళ్లి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శుక్రవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ధర్మాన తన క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.

కాంగ్రెస్‌కు జగన్ వల్లే అవమానం జరిగిందని, అలాంటి వ్యక్తికి అధికారం ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకులెవరూ ముందుకు రారని ఆయన అన్నారు. జగన్ తన పత్రిక, టీవీ చానల్ ద్వారా ప్రభుత్వ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అయితే, ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారని ఆయన అన్నారు. వ్యాపారమే ధ్యేయంగా జగన్ పని చేస్తున్నారని, ప్రజల కన్నీరు తుడవడానికి, ఆకలి తీర్చడానికి 67 కంపెనీలు అవసరమా అని ఆయన అన్నారు.

గత ఎనిమిదేళ్ల కాలంలో శాసనసభ్యుడు ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని మంత్రి విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఒక్కటేనంటూ ప్రజల్లో ఉన్న అపోహను తొలగించడానికి కార్యకర్తలు మరింతగా పనిచేయాలని ఆయన కోరారు.

నరసన్నపేటలో వచ్చేనెలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయడానికి కార్యకర్తలంతా కృషిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని వీడి వైయస్సార్ పార్టీలోకి వెళ్లిన నాయకులు తప్పును సరిదిద్దుకుని తిరిగి పుట్టింటికి వస్తున్నారని ధర్మాన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+