ఊచకోత: మాజీ సిఆర్‌పిఎఫ్ జవానుకు ఉరిశిక్ష

Srikakulam District
శ్రీకాకుళం: ఏడుగురి ఊచకోత కేసులో శ్రీకాకుళం జిల్లా కోర్టు సోమవారం సంచలన తీర్పు చెప్పింది. ఏడుగురిని ఊచకోత కోసిన కేసులో సిఆర్‌పిఎఫ్ మాజీ జవాను శంకరరావుకు ఉరిశిక్ష వేస్తూ కోర్టు తీర్పు చెప్పింది. 2010 నవంబర్ 30వ తేదీన శంకరరావు తన సొంత పిల్లలు ఇద్దరిని, మరో ఐదుగురు గ్రామస్థులను హత్య చేశాడు. శ్రీకాకుళం జలమూరు మండలం మెట్టపేట గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

తన భార్యను హత్య చేసిన ఘటనలో సాక్ష్యం చెబుతారనే భయంతో శంకరరావు తన ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశాడు. గ్రామానికి చెందిన మరో ఐదుగురిని కూడా ఊచకోత కోశాడు. తలను, మొండాన్ని ఆ ఆలయంలో ఉంచి తన పైశాచికత్వాన్ని చాటుకున్నాడు. భార్యను చంపిన కేసులో శిక్ష నుంచి తప్పిచుకోవడానికి అతను అలా చేశాడు.

ఆ రోజు శంకరరావు కత్తులు, బాంబులతో స్వైర విహారం చేశాడు. గ్రామస్థులను భయపెట్టాడు. అయితే, పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. కోర్టులో దాదాపు ఏడాదిన్నర పాటు కేసు విచారణ సాగింది. శంకరరావు తరఫున వాదించడానికి తొలుత న్యాయవాదులు ఎవరూ రాలేదు. చివరకు ఓ న్యాయవాది అతని తరఫున వకాల్తా పుచ్చుకున్నాడు.

శ్రీకాకుళం జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ శంకరరావు పైకోర్టుకు వెళ్తాడా, లేదా అనేది తెలియడం లేదు. అయితే, అతను పైకోర్టుకు వెళ్లాలనుకుంటే న్యాయవాదులు సహకరిస్తారా, లేదా అనేది కూడా అనుమానంగానే ఉందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+