చిన్నారి సేఫ్: హైదరాబాద్ లేడీ టెక్కీ మృతి

ప్రమాదం నుంచి ఏడాదిన్నర చిన్నారి సురక్షితంగా బయటపడ్డాడు. ముఖం స్వల్పంగా కాలింది. ఇతన్ని మదురైి చెందన కౌశిక్గా గుర్తించారు. తండ్రి వెంకటేష్ బాబు, సోదరుడు హర్షిత్ ప్రమాదంలో మరణించినట్లు అనుమానిస్తున్నారు. కాగా, ప్రమాదం నుంచి 27 మంది ప్రయాణికులు బయటపడినట్లు తెలుస్తోంది. వీరు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రీలో చికిత్స పొందుతున్నవారు - రేఖ, వీణ, సాంబశివరావు, శిరీష, వెంకట కోటేశ్వర రావు వర్మ, హుసేన్, రాఘవన్, కెకె సునీల్ కుమార్, హర్షిత్, సందీప్ అగ్నిహోత్రి, అమీర్ ప్రీత్ సింగ్.
పీపుల్స్ పాలీ క్లినిక్లో చికిత్స పొందుతున్నవారు - విజయ కుమార్, ఖుర్షీ
నెల్లూరు జయభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు - సరళ, బంజర్ లాల్, విద్యాభాస్కర్, శ్రీనివాసులు, ప్రకాష్ సింగ్, శోభా సింగ్
బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు - మదన్లాల్, హరికిషన్, అనూష, తిరుపతమ్మ, సంపత్.
రాష్ట్రంలోని నెల్లూరు వద్ద ప్రమాదానికి గురైన తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలులోని ఎస్ - 11 బోగీలో మొత్తం 72 మంది ప్రయాణికులు ఉన్నారు. ఢిల్లీలో 17 మంది, భోపాల్లో 11 మంది, ఆగ్రాలో ముగ్గురు, నాగపూర్లో ఒకరు, ఝాన్సీలో ఆరుగురు, వరంగల్లో ఏడుగురు, విజయవాడలో 28 మంది ప్రయాణికులు ఈ బోగీలో ఎక్కారు. ప్రమాదంలో ఎస్ - 11 బోగీ పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications