టిడిపి ఎమ్మెల్యేల ధర్నా, అరెస్టు: యాష్కీ హెచ్చరిక

ఇదిలావుంటే, ఫీజు రీయంబర్స్మెంట్ వ్యవహారంపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ను యధాతథంగా అమలు చేయకపోతే తాను ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ఆయన చెప్పారు. ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వివరిస్తామని, కిరణ్ కుమార్ రెడ్డి వినకపోతే పార్టీ అధిష్టానానికి చెబుతామని, అప్పుడు కూడా పరిష్కారం కాకపోతే తాను ఆమరణ దీక్షకు దిగుతానని ఆయన వివరించారు.
ఇదిలావుంటే, ఫీజు రీయంబర్స్మెంట్పై మంత్రి వర్గ ఉప సంఘం సమావేశమైంది. ఖమ్మం జిల్లా ఇందిరమ్మ బాటలో ఉన్న ముఖ్యమంత్రి వచ్చిన తిరిగి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమావేశం వాయిదా పడింది. ఫీజు రియంబర్స్మెంట్, ఫీజు విధానంపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటైంది. ఫీజు ఎంతో తెలియకుండా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించడం వల్ల తలెత్తే సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికే న్యాయసలహా కోరింది.
అడ్వకేట్ జనరల్ నుంచి దీనికి సంబంధించిన నివేదిక అందకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రేపటి సమావేశంతో పాటు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశాన్ని ఉప సంఘం పరిశీలిస్తోంది. కాగా, మంత్రి పితాని సత్యనారాయణ బిసి సంఘాల నాయకులతో సమావేశమయ్యారు.
ఫీజు రీయంబర్స్మెంట్పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే పోరు బాట పట్టారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈ నెల 13, 14 తేదీల్లో ఫీజు దీక్ష చేపట్టనున్నారు. నిజానికి ఈ నెల 12, 13 తేదీల్లో ఈ దీక్ష జరగాల్సి ఉండింది. ఈ నెల 12వ తేదీన గ్రూప్ - 4 పరీక్షలు ఉండడంతో ఒక రోజు దీక్షను వాయిదా వేసుకున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications