టిడిపి ఎమ్మెల్యేల ధర్నా, అరెస్టు: యాష్కీ హెచ్చరిక

ఇదిలావుంటే, ఫీజు రీయంబర్స్మెంట్ వ్యవహారంపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ను యధాతథంగా అమలు చేయకపోతే తాను ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ఆయన చెప్పారు. ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వివరిస్తామని, కిరణ్ కుమార్ రెడ్డి వినకపోతే పార్టీ అధిష్టానానికి చెబుతామని, అప్పుడు కూడా పరిష్కారం కాకపోతే తాను ఆమరణ దీక్షకు దిగుతానని ఆయన వివరించారు.
ఇదిలావుంటే, ఫీజు రీయంబర్స్మెంట్పై మంత్రి వర్గ ఉప సంఘం సమావేశమైంది. ఖమ్మం జిల్లా ఇందిరమ్మ బాటలో ఉన్న ముఖ్యమంత్రి వచ్చిన తిరిగి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమావేశం వాయిదా పడింది. ఫీజు రియంబర్స్మెంట్, ఫీజు విధానంపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటైంది. ఫీజు ఎంతో తెలియకుండా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించడం వల్ల తలెత్తే సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికే న్యాయసలహా కోరింది.
అడ్వకేట్ జనరల్ నుంచి దీనికి సంబంధించిన నివేదిక అందకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రేపటి సమావేశంతో పాటు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశాన్ని ఉప సంఘం పరిశీలిస్తోంది. కాగా, మంత్రి పితాని సత్యనారాయణ బిసి సంఘాల నాయకులతో సమావేశమయ్యారు.
ఫీజు రీయంబర్స్మెంట్పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే పోరు బాట పట్టారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈ నెల 13, 14 తేదీల్లో ఫీజు దీక్ష చేపట్టనున్నారు. నిజానికి ఈ నెల 12, 13 తేదీల్లో ఈ దీక్ష జరగాల్సి ఉండింది. ఈ నెల 12వ తేదీన గ్రూప్ - 4 పరీక్షలు ఉండడంతో ఒక రోజు దీక్షను వాయిదా వేసుకున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications