ఎదుర్కోవటం ఎలా: బాలకృష్ణతో ఎర్రబెల్లి సమాలోచనలు

బాలయ్యతో ఎర్రబెల్లి భేటీలో పలు విషయాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసినందు వల్ల సీమాంధ్రలో ఎలా ఎదుర్కోవాలి, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిని, వైయస్ జగన్ ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసును ఎలా ఢీకొనాలి అనే అంశం వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై మరోసారి లేఖ ఇచ్చేందుకు టిడిపి సిద్ధపడుతున్న నేపథ్యంలో కెసిఆర్ ఎత్తుగడలను, ఆ ప్రాంతంలో పాతుకు పోయేందుకు జగన్ రచిస్తున్న వ్యూహాల విషయమై కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
రెండు రోజుల క్రితం ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినం సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జెండా ఎగురవేసిన అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన విషయం తెలిసిందే. తమ పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉందని, కేంద్రానికి ఓసారి లేఖ రాసిందని, మరోసారి లేఖ రాసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. అయితే బాలయ్య వ్యాఖ్యలు మాత్రం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని చెప్పవచ్చు.
కాగా బాలయ్యతో భేటీ అనంతరం ఎర్రబెల్లి దయాకర రావు ప్రముఖ స్వతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీతో భేటీ అయ్యారు. బాపూజీ తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పలుమార్లు సీమాంధ్ర, తెలంగాణ నేతలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించారు.
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications