Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పింక్ రిబ్బన్ వాక్‌లో మోహన్ బాబు, వివిఎస్, అమల

Mohan Babu -Amala
హైదరాబాద్: రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన కోసం ఉషా లక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, హైదరాబాద్-అమెరికా కాన్సులేట్ జనరల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం హైదరాబాదులోని కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్(కెబిఆర్ పార్క్) వద్ద పింక్ రిబ్బన్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున సతీమణి అమల, ప్రముఖ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ తదితర సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కెబిఆర్ పార్క్ నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మీదిగా తిరిగి కెబిఆర్ పార్క్‌కు చేరుకుంది.

బ్రెస్ట్ క్యాన్సర్ పైన అవగాహన కార్యక్రమంలో భాగంగా వీరు రెండు కిలోమీటర్లు నడిచారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడారు. అందరూ వ్యాధుల పైన అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు అయినప్పటికీ వ్యాధుల గురించి మాట్లాడుకోవడంలో తప్పు లేదన్నారు. రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకోవాలని మోహన్ బాబు ఈ సందర్భంగా సూచించారు. అనంతరం అమల మాట్లాడుతూ... రొమ్ము క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+