బిపి ఆచార్యకు షరతులతో కూడిన బెయిల్

ఎమ్మార్ కేసులో నిందితుడైన బిపి ఆచార్య ఈ సంవత్సరం జనవరి 30వ తేదిన అరెస్టయ్యారు. ఆ తర్వాత సిబిఐ ప్రత్యేక కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సిబిఐ హైకోర్టులో సవాల్ చేసింది. అక్కడ బిపి ఆచార్యకు చుక్కెదురయింది. దీంతో అప్పటి నుండి అతను జైలులోనే ఉన్నారు. రెండుమూడు సార్లు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కానీ సిబిఐ కేసు దర్యాఫ్తులో ఉందని చెబుతూ బెయిల్కు నిరాకరిస్తూ వచ్చింది. దీంతో కోర్టులో పలుమార్లు అతనికి చుక్కెదురయింది.
ఎమ్మార్ కేసులో ఇతను భారీ అవకతవకలకు పాల్పడ్డారనేది సిబిఐ ఆరోపణ. అక్రమాలు తెలిసి కూడా సంబంధిత అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేయలేదని, ఎమ్మార్కు లబ్ధి చేకూర్చేందుకు ఎపిఐఐసి వాటాలు తగ్గడంలో ఆచార్యనే ప్రధాన కుట్రదారు అని సిబిఐ ఆరోపణ. ఈ రోజు కూడా బిపి ఆచార్య బెయిల్ పిటిషన్ను సిబిఐ తిరస్కరించింది. అయితే ఆచార్య తరఫు న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించి అతనికి బెయిల్ మంజూరు చేసింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications