హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బేగంపేట వైపుకు దూసుకెళ్లారు: సొమ్మసిల్లిన హరీష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao-Nagam Janardhan Reddy
హైదరాబాద్: నగరంలో జరుగుతున్న జీవ వైవిధ్య సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి సమితి శాసనసభ్యులు, నేతలు, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి నేతలు, నాగం జనార్ధన్ రెడ్డి తదితరులు ఇందిరా పార్కు నుండి బేగంపేట వైపుకు దూసుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

బేగంపేట వైపుకు వెళ్తున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని గాంధీ నగర్ పోలీసు స్టేషన్‌కి తరలించారు. తెలంగాణ నగారా సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద ప్రధాని రాకను నిరసిస్తూ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మన్మోహన్ సింగ్ పైలాన్ ప్రాజెక్టును ప్రారంభించి బేగంపేటకు వస్తున్న విషయాన్ని తెలుసుకున్నారు. ఇందిరా పార్కు వెనుక గేటు నుండి బేగంపేట వైపుకు వెళ్లే ప్రయత్నం చేశారు.

ట్యాంకుబండ్ వద్ద ఏర్పాటు చేసిన బారీకేడ్లను వారు తొలగించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. వెళ్లనిచ్చేది లేదని చెప్పారు. ఎమ్మెల్యేలు జోగు రామన్న, నాగం జనార్దన్ రెడ్డిలు రోడ్డుపై బైఠాయించారు. హరీష్ రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో హరీష్ రావు సొమ్మసిల్లి పడిపోయారు. కాసేపటికి హరీష్ మేల్కొన్నారు. తిరిగి బేగంపేట వైపుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు హరీష్ రావు, కోదండరామ్, నాగం జనార్ధన్ రెడ్డి, స్వామి గౌడ్ తదితరులను అరెస్టు చేశారు.

English summary
Telangana MLAs Harish Rao, Nagam Janardhan Reddy and JAC leaders were arrested by Hyderabad police at Indira Park on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X