మూత్రం తాగించిన టీచర్: పాముకాటుతో విద్యార్థి మృతి
విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి గౌరిని, యాజమాన్యాన్ని నిలదీశారు. పలువురు తల్లిదండ్రులు కూడా ఆందోళనకు దిగారు. యాజమాన్యం వారికి సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తోంది. టీచర్ గౌరీని తల్లిదండ్రులు ఓ గదిలో బంధించారు. ఒకటో తరగతి విద్యార్థితో బలవంతంగా మూత్రం తాగించడం ఏమిటని నిలదీశారు. టీచర్ పైన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తోంది.
హైదరాబాదులో...
కూకట్పల్లిలోని షంషీగంజ్ పాఠశాలలో ఓ విద్యార్థి పాముకాటుతో మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి కిషోర్గా తెలుస్తోంది. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల చుట్టుపక్కల పరిస్థితులు అప్పుడప్పుడు విష పురుగులు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
మరో పాఠశాలలో ఎల్కెజి విద్యార్థిని ప్రిన్సిపల్ దారుణంగా చితకబాదాడు. విద్యార్థి శరీరం కందిపోయింది. పోలీసులు ప్రిన్సిపల్ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.