వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ కోసం మమ్మల్ని ఇరికిస్తున్నారు: మంత్రులు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైయస్ జగన్‌ను రక్షించేందుకు, జగన్‌కు అనుకూలంగా సాక్ష్యాలు పుట్టించేందుకే తమను ఇరికించాలని చూస్తున్నారని మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నియమ, నిబంధనలకు అనుగుణంగానే తాము జీవోలు జారీ చేశామని, వాటి వెనుక జగన్ చేసిన కుట్రలు, నేరాలు తమకు తెలియవని అన్నారు. ఆయన ప్రవర్తన, నేర ప్రవృత్తి కూడా తమకు తెలియదని చెప్పారు. ఈ మేరకు ఆరుగురు మంత్రులు, ఆరుగురు ఐఎఎస్ అధికారులు సోమవారం సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.

జగన్ అక్రమాస్తుల కేసులో తమ పాత్రపై విచారణ జరపాలంటూ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. వైయస్ జగన్‌కు సహకరించాలన్న రహస్య ఎజెండాతోనే పిటిషనర్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారని వారు ఆరోపించారు. జగన్‌ను సిబిఐ విచారిస్తున్న తీరుపట్ల పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారే తప్ప తమపై చేసిన ఆరోపణలను రుజువు చేసేలా ఒక్క ఆధారం కూడా చూపలేదని వారన్నారు.

చట్టాలను దుర్వినియోగం చేస్తూ, న్యాయ ప్రక్రియను తప్పుదోవ పట్టించాలని చూస్తున్న పిటిషనర్ ఉద్దేశాలను గమనించి ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించాలని, ఆయనకు భారీగా జరిమానా విధించాలని వారు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మంత్రులు గీతారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, సబిత ఇంద్రారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణ, మోపిదేవి వెంకటరమణ (ప్రస్తుతం మాజీ మంత్రి), ఐఏఎస్ అధికారులు ఎం.శామ్యూల్, మన్మోహన్‌సింగ్, శ్యాంబాబు, ఆదిత్యనాథ్ దాస్, సీవీఎస్‌కే ప్రసాద్, ఎస్వీ ప్రసాద్ (ప్రస్తుతం రిటైర్డ్) కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశారు. ఐఏఎస్ రత్నప్రభ గతంలోనే కౌంటర్ దాఖలు చేశారు. మరో ఐఏఎస్ శ్రీలక్ష్మికి కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు వారాల గడువు లభించింది.

జగన్ కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన ఐదు నెలల తర్వాత పిటిషనర్ కోర్టుకు ఫిర్యాదు చేయడం గమనించాల్సి ఉందని వారన్నారు. తమ పేరిట జారీ అయిన జీవోలన్నీ నిబంధనల ప్రకారమే ఉన్నాయని, సిబిఐ నమోదు చేసిన కేసులో ముద్దాయిలైన జగన్, ఇతరులు వారి హోదాలను దుర్వినియోగం చేసి, జీవోల ద్వారా లబ్ధి పొందిన వారితో నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు తమకు తెలియదని వారు తమ కౌంటర్‌లో అన్నారు.

English summary
The ministers and IAS officers, received notices from Supreme Court have filed counter affidavit in YSR Congress party president YS Jagan. They pleaded their innocence in the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X