మహిళా టెక్కీ ఆత్మహత్య: వేధింపులతో టెక్కీ సతీమణి
వీరికి ఇద్దరు పిల్లలు. కెపిహెచ్బి కాలనీలో ఉంటారు. ఓ బంధువుల అమ్మాయి కూడా వీరితోపాటే ఉంటుంది. సోమవారం ఉదయం భర్త ఆఫీసుకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో ఇంట్లోని బెడ్ రూంలోకి వెళ్లి అనిత గడియ పెట్టుకుంది. బంధువుల అమ్మాయి ఎంతగా తలుపు కొట్టినా తీయలేదు. దీంతో భర్తకు ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా.. అనిత చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకొని కనిపించింది.
ఆమె రాసిన సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరకట్న వేధంపులతో తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. మరోవైపు భర్తతో తగాదా కారణంగా మరో సాఫ్టువేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది.
బంజారాహిల్స్లోని రోడ్డు నెంబర్ మూడులో ఉంటున్న అనిత, నవీన్ల పెళ్లి నాలుగేళ్ల క్రితం జరిగింది. భార్య సాఫ్టువేర్ ఇంజనీర్గా పని చేస్తోంది. ఓ శుభకార్యానికి సంబంధించి గిఫ్ట్ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భర్త బయటకు వెళ్లిన తర్వాత భార్య ఆవేశంలో గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.