హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళా టెక్కీ ఆత్మహత్య: వేధింపులతో టెక్కీ సతీమణి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Software Engineer commits suicide
హైదరాబాద్: వరకట్న వేధింపులతో ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ సతీమణి, భర్తతో తగాదా పెట్టుకొని మరో సాఫ్టువేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నారు. కెపిహెచ్‌బి పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం వరకట్న వేధింపులతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకు చెందిన చైతన్య, దేవేందర్‌ల వివాహం 2008లో జరిగింది. దేవేందర్ ప్రముఖ ఐటి కంపెనీలో పని చేస్తున్నాడు.

వీరికి ఇద్దరు పిల్లలు. కెపిహెచ్‌బి కాలనీలో ఉంటారు. ఓ బంధువుల అమ్మాయి కూడా వీరితోపాటే ఉంటుంది. సోమవారం ఉదయం భర్త ఆఫీసుకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో ఇంట్లోని బెడ్ రూంలోకి వెళ్లి అనిత గడియ పెట్టుకుంది. బంధువుల అమ్మాయి ఎంతగా తలుపు కొట్టినా తీయలేదు. దీంతో భర్తకు ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా.. అనిత చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించింది.

ఆమె రాసిన సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరకట్న వేధంపులతో తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. మరోవైపు భర్తతో తగాదా కారణంగా మరో సాఫ్టువేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది.

బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ మూడులో ఉంటున్న అనిత, నవీన్‌ల పెళ్లి నాలుగేళ్ల క్రితం జరిగింది. భార్య సాఫ్టువేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. ఓ శుభకార్యానికి సంబంధించి గిఫ్ట్ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భర్త బయటకు వెళ్లిన తర్వాత భార్య ఆవేశంలో గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

English summary
A software Engineer from Hyderabad has committed suicide on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X