హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప ఎక్సైజ్ కానిస్టేబుల్ పరుగు పందెం: అభ్యర్థి మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kadapa Dist
కడప: ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పరుగు పందెంలో అపశృతి చోటు చేసుకుంది. సోమవారం కడపలో నిర్వహించిన ఎక్సైజ్ కానిస్టేబుళ్ల నియామక పరుగు పందెంలో పాల్గొన్న ఓ అభ్యర్థి మృతి చెందాడు. పరుగు పందెం సమయంలో సంజీవ్ అనే అభ్యర్థి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో పోలీసులు వెంటనే అతనిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సంజీవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంజీవ్ జిల్లాలోని చిన్నమండెం మండలంకు చెందిన మల్లూరు గ్రామవాసి. అతను మృతి చెందగానే పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కానిస్టేబుల్ ఉద్యోగం కోసమంటూ వెళ్లిన తమ కొడుకు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. గుండెపోటు కారణంగానే సంజీవ్ మృతి చెందాడని రిమ్స్ డైరెక్టర్ సిద్దప్ప గౌరవ్ తెలియజేశారు.

కృష్ణా జిల్లాలో కారు - లారీ ఢీ

జిల్లాలోని గరికపర్రు చెక్ పోస్టు సమీపంలో జాతీయ రహదారిపైన సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ, కారు ఢీకోవడంతో వారు మృతి చెందారు. చెక్ పోస్టు వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి వచ్చిన కారు ఢీకొంది. మృత్యువాత పడ్డవారు పశ్చిమ గోదావరి జిల్లా వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
Sanjeevi, who is from Mallur was died on Monday in RIMS hospital. He was collapsed while running for Excise Constable run.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X