మీటింగ్లో పేరుతో ఎన్నిసార్లు రారు: ఎల్వీపై కోర్టు ఫైర్

ఈ కేసులో మంత్రి ధర్మాన ప్రసాద రావును, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణలను ప్రశ్నించేందుకు తమకు ప్రభుత్వం అనుమతి అవసరం లేదని ఈ నెల 17వ తేదిన సిబిఐ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి వాదనలు ప్రారంభమయ్యాయి. పిసి యాక్ట్ కింద అభియోగాల నేపథ్యంలరో ధర్మానపై విచారణ మొదలైంది. మోపిదేవి, బ్రహ్మానంద రెడ్డిల పైన కూడా విచారణ మొదలవనుంది. ఆస్తుల కేసుకు సంబంధించి జగన్ రిమాండును కోర్టు ఫిబ్రవరి 14 వరకు పొడిగించింది.
ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సిబిఐ కోర్టు ఆగ్రహం
ఎమ్మార్ కేసులో నిందితుడు ఐఏస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సిబిఐ కోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్వీ కోర్టుకు హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్వీ ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్నారు. సమావేశాల కారణంగా ఎల్పీ కోర్టుకు హాజరు కాలేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. దీంతో సమావేశాల పేరుతో ఎన్నిసార్లు కోర్టుకు హాజరుకారని ప్రశ్నించింది.
ఇప్పటి వరకు ఎన్ని సమావేశాలకు హాజరయ్యారో చెప్పాలని అడిగింది. ఎప్పుడెప్పుడు ఏయే సమావేశాలకు హాజరయ్యారో పూర్తి వివరాలు ఇవ్వాని ఆదేశించింది. తదుపరి విచారణకు తమ క్లయింట్ హాజరవుతారని ఎల్వీ సుబ్రహ్మణ్యం తరఫు లాయర్లు కోర్టుకు విన్నవించారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications