మీటింగ్లో పేరుతో ఎన్నిసార్లు రారు: ఎల్వీపై కోర్టు ఫైర్
ఈ కేసులో మంత్రి ధర్మాన ప్రసాద రావును, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణలను ప్రశ్నించేందుకు తమకు ప్రభుత్వం అనుమతి అవసరం లేదని ఈ నెల 17వ తేదిన సిబిఐ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి వాదనలు ప్రారంభమయ్యాయి. పిసి యాక్ట్ కింద అభియోగాల నేపథ్యంలరో ధర్మానపై విచారణ మొదలైంది. మోపిదేవి, బ్రహ్మానంద రెడ్డిల పైన కూడా విచారణ మొదలవనుంది. ఆస్తుల కేసుకు సంబంధించి జగన్ రిమాండును కోర్టు ఫిబ్రవరి 14 వరకు పొడిగించింది.
ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సిబిఐ కోర్టు ఆగ్రహం
ఎమ్మార్ కేసులో నిందితుడు ఐఏస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సిబిఐ కోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్వీ కోర్టుకు హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్వీ ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్నారు. సమావేశాల కారణంగా ఎల్పీ కోర్టుకు హాజరు కాలేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. దీంతో సమావేశాల పేరుతో ఎన్నిసార్లు కోర్టుకు హాజరుకారని ప్రశ్నించింది.
ఇప్పటి వరకు ఎన్ని సమావేశాలకు హాజరయ్యారో చెప్పాలని అడిగింది. ఎప్పుడెప్పుడు ఏయే సమావేశాలకు హాజరయ్యారో పూర్తి వివరాలు ఇవ్వాని ఆదేశించింది. తదుపరి విచారణకు తమ క్లయింట్ హాజరవుతారని ఎల్వీ సుబ్రహ్మణ్యం తరఫు లాయర్లు కోర్టుకు విన్నవించారు.