నా కూతురే సేఫ్ ఫీల్ కావడం లేదు: షీలా దీక్షిత్
మహిళలపై నేరాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని, ఇది పోటీ కాదని, తాను ఆ వివరాల్లోకి వెళ్లదలుచుకోలేదనిన ఆమె అన్నారు. ఓ టీవీ చానెల్ ప్రతినిధితో ఆమె ఆ విధంగా అన్నారు. వీధిలో అమ్మాయిలు నడిచి వెళ్తుంటే ఎవరు మాత్రం ఎందుకు వేధించాలని ఆమె అన్నారు. పాఠశాలకో లేదో కాలేజీకో వెళ్తే ఈలలు మాత్రమే వినిపించేవని అన్నారు.
ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని మహిళల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించడానికి చాలా చేయాల్సి ఉందని అన్నారు. శాంతిభద్రతల పరిస్థితిపై తాను సంతృప్తిగా లేనని అన్నారు. డిసెంబర్ 16వ తేదీ తర్వాత పరిస్థితి మెరుగు పడిందో లేదో అంచనా వేయలేకపోతున్నానని షీలా దీక్షిత్ అన్నారు.
గట్టి పోలీసు భద్రతను కోరుతూ జోక్యం చేసుకోవాలని తాను ప్రధాని మన్మోహన్ సింగ్కు రాసిన లేఖకు స్పందన లేదని, పోలీసు భద్రత అనేది మంత్రదండం కాదు కదా అని ఆమె అన్నారు. ప్రభుత్వంపై అన్ని మోపలేమని, తమ ప్రభుత్వం చేతిలో లేనప్పటికీ తాను శాంతిభద్రతల గురించి పట్టించుకుంటున్నానని ఆమె అన్నారు.