ధిక్కారమున్ సైతునా: ఎల్వీపై మంత్రి సిఆర్ ఫైర్

ఈ వివాదానికి సంబంధించిన పూర్వపరాలు ఈ విధంగా ఉన్నాయి - తిరుమల-తిరుపతి దేవస్థానంలో పలు అవకతవకలు జరుగుతున్నాయని శాసనసభ పిటిషన్స్ కమిటీకి ఓ ఫిర్యాదు అందింది. ఈ పిటిషన్ను పరిశీలించి ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని పిటిషన్స్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. నిబంధనల ప్రకారం శాసనసభ ఏదైనా సమాచారం కోరితే సంబంధిత మంత్రి కార్యదర్శి దానికి బాధ్యత తీసుకోవాలి.
పిటిషన్స్ కమిటీ రాసిన లేఖ కూడా మంత్రి రామచంద్రయ్యకు, అక్కడి నుంచి దేవాదాయశాఖ వ్యవహారాలు చూస్తున్న రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఎంజే గోపాల్కు వెళ్లింది. శాసనసభ కమిటీ నుంచి వచ్చిన ఈ పిటిషన్పై విచారణ జరిపి తనకు నివేదిక పంపాలని ఎంజే గోపాల్ టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను కోరారు.
ఈ పిటిషన్లో పేర్కొన్న అంశాలకు సమాధానాలు రాస్తున్నప్పుడు సుబ్రహ్మణ్యం మంత్రి రామచంద్రయ్య ప్రస్తావన కూడా తేవాల్సి వచ్చినట్లు తెలిసింది. ఈ సమాధానం మంత్రి కార్యదర్శి ద్వారా మళ్లీ పిటిషన్స్ కమిటీకి వెళ్లాలి. అలా వెళితే మంత్రి నుంచి తనకు సమస్యలు వస్తాయని భావించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం నేరుగా పిటిషన్స్ కమిటీకి పంపేశారు. ఇది తెలుసుకున్న మంత్రి రామచంద్రయ్య అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications