వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ సెకండియర్ ఫలితాలు: బాలికలదే పైచేయి

By Pratap
|
Google Oneindia TeluguNews

 Intermediate second year results released
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను మాధ్యమిక శాఖ మంత్రి పార్థసారథి శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. మొత్తం 11 లక్షల మంది పరీక్షలు రాశారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది. బాలికులు 69.04 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలురు 62 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 65.36 శాతం మంది విద్యార్థినీవిద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

ఇంటర్ సెకండియర్ ఫలితాలకు క్లిక్ చేయండి

ఈ ఏడాది నిరుటికన్నా ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది. నిరుడు 58.43 శాతం మంది విద్యార్థినీవిద్యార్థినులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల సాధనలో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలువగా మహబూబ్‌నగర్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లాలో 75 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, మహబూబ్‌నగర్ జిల్లాలో 45 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

ఒకేషనల్‌లో 68 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే విద్యార్థులు మెరుగైన ఫలితాలను కనబరిచారని మంత్రి పార్థసారథి అభినందించారు. 2012 లో ఉత్తీర్ణతా శాతం 52.43గా ఉంది. గత ఏడాదితో పోలిస్తే 6.93 శాతం అధిక్యత సాధించినట్లు మంత్రి తెలిపారు.

మార్క్స్ మెమోను ఏప్రిల్ 30 ఆయా కాలేజీలకు అందజేయనున్నట్లు తెలిపారు. మే 22 ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. మే 22 ఉదయం ఇంటర్ మొదటి సంవత్సరం, మధ్యాహ్నం రెండవ సంవత్సర పరీక్షలు జరుగనున్నాయి. మే 6 సప్లమెంటరీ పరీక్ష ఫీజు చివరి తేదీ.

English summary
Minister Parthasarathy has released intermediate second year results today at the office Board of Intermediate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X