జగన్ బెంగళూరు, లోటస్పాండ్ బిల్డింగ్స్ అటాచ్కు రంగం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన మరిన్ని ఆస్తులను ఆటాచ్ చేసుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడి) ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. వాన్పిక్ అంశానికి సంబంధించి జగన్ ఆస్తులతో పాటు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్కు చెందిన ఆస్తులను కూడా అటాచ్ చేసే దిశలో ఈడి కదులుతోందని తెలుస్తోంది.
హైదరాబాదులోని లోటస్ పాండులోని జగన్ ఇంటితో పాటు బెంగళూరులోని యెలహంకలో ఇంటిని ఈడి అటాచ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగతి పబ్లికేషన్స్కు చెందిన ఆస్తులపై కూడా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా దాదాపు రూ.840 కోట్ల ఆస్తుల అటాచ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో కార్లు, ఇతర ఆస్తులు కూడా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

నిమ్మగడ్డ ప్రసాద్కు చెందిన రూ.1,500 కోట్ల విలువైన ఆస్తులను ఈడి స్వాధీనం చేసుకునే దిశలో కేసు దర్యాఫ్తు జరుగుతోందని అంటున్నారు. సిలికాన్ బిల్డర్స్ ద్వారా జగన్ లాభపడ్డారని, నిమ్మగడ్డ, అతని సంస్థలు వేలాది ఎకరాలు లబ్ది పొందాయని సిబిఐ తన ఛార్జీషీటులో ఆరోపించింది. ఇవే కాకుండా జగన్ ఆస్తుల కేసులో మరిన్ని అటాచ్లు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
జూన్ చివరి నాటికి మరో మూడు ఛార్జీషీట్లు?
జగన్ ఆస్తుల కేసులో జూన్ చివరి నాటికి సిబిఐ మరో రెండు లేదా మూడు ఛార్జీషీట్లు దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, కోల్కతా బ్రీఫ్కేస్ కంపనీలకు సంబంధించిన ఛార్జీషీట్లను సిబిఐ క్లియరెన్స్ కోసం ఢిల్లీకి పంపించినట్లుగా తెలుస్తోంది. ఈ మూడు అప్రూవ్ అయితే ఒకే ఛార్జీషీట్గా దాఖలు చేసే అవకాశముందంటున్నారు. ఇందులో పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రా రెడ్డిల పేర్లు ఉండే అవకాశముంది. బిసిసిఐ మాజీ చీఫ్ శ్రీనివాసన్ పేరు కూడా ఛార్జీషీటులో ఉండే అవకాశాలున్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications