ఛేజింగ్ చేసి మావోల్ని అరెస్ట్ చేశారు: వారిలో మాధురి?

ఈ క్రమంలో కొత్తగూడెం, పాల్వంచలోని సాయినగర్ వద్ద మావోయిస్టులు ప్రయాణిస్తున్న జీపు బొల్తా పడింది. ఘటనలో జీపులో ప్రయాణిస్తున్న ముగ్గురు నక్సలైట్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకోగానే మావోయిస్టులు థర్మారాజు, పృధ్వీలతోపాటు మరో మహిళా మావోయిస్టు తప్పించుకునే ప్రయత్నం చేశారు.
ఆ మహిళను ఉత్తర తెలంగాణ కార్యదర్శి చంద్రన్న భార్య సక్కుబాయి, అలియాస్ రాధ అలియాస్ మాధురిగా అనుమానిస్తున్నారు. ఆమెకు ఛత్తీస్గఢ్ దాడి ఘటనతో సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని, చికిత్స నిమిత్తం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. వారు చికిత్స కోసం విజయవాడ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.
కామారెడ్డి సిఐని అరెస్టు చేయాలని ఆదేశం
కామారెడ్డి సిఐ కృష్ణను అరెస్టు చేయాలని నిజామాబాద్ జిల్లా కోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. న్యాయవాది గోపిపై దాడి చేసిన కేసులో సిఐని అరెస్టు చేయాలని కోర్టు స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో కృష్ణకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఆ కేసు విచారణకు సిఐ హాజరు కాలేదు.












Click it and Unblock the Notifications