వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిందాల్ సంస్థ తప్పుడు సమాచారం, దాసరి నోట్: సిబిఐ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dasari Narayana Rao - Naveen Jindal
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు నవీన్ జిందాల్ సంస్థకు ప్రయోజనం చేకూరేలా నాటి కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి దాసరి నారాయణ రావు.. అప్పట్లో బొగ్గు శాఖ కార్యదర్శికి నోట్ పంపారని సిబిఐ పేర్కొంది. జిందాల్‌కు చెందిన జిందాల్ గ్రూప్ బొగ్గు మంత్రిత్వ శాఖకు తప్పుడు సమాచారం ఇచ్చిందని బొగ్గు కుంభకోణం కేసు దర్యాఫ్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) వెల్లడించింది.

ఈ కుంభకోణంపై సిబఐ కోర్టుకు 12వ ఎప్ఐఆర్‌ను సమర్పించింది. గనుల కేటాయింపు, ప్లాంట్ల ఏర్పాటు తదితరాలపై జిందాల్ తప్పుడు సమాచారం ఇచ్చిందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ఆ కంపెనీకి గతంలో కేటాయించిన గనుల పైనా సరైన సమాచారం ఇవ్వలేదని, అలాంటి సంస్థకు ప్రయోజనం చేకూరేలా నాటి మంత్రి దాసరి.. బొగ్గు శాఖ కార్యదర్శికి నోట్ పంపారని అందులో సిబిఐ పేర్కొంది.

బొగ్గు మంత్రిత్వ శాఖకు తప్పుడు సమాచారం ఇచ్చినా.. స్క్రీనింగ్ కమిటీ వాటికే గనులు కేటాయిస్తూ జాబితా రూపొందించిందని తెలిపింది. అమరకొండ గనులను జిందాల్‌కు ఇవ్వాలన్న ప్రతిపాదనను విద్యుత్ మంత్రిత్వ శాఖ వ్యతిరేకించిందని పేర్కొన్నారు. కాగా సిబిఐ తాజా ఎఫ్ఐఆర్‌లో నవీన్ జిందాల్‌కు చెందిన రెండు సంస్థలను నిందితులుగా పేర్కొంది.

జార్ఖండ్ ప్రభుత్వం కూడా జిందాల్‌కు అనుకూలంగా వ్యవహరించిందని తెలిపింది. 2007లో రాష్ట్ర ప్రభుత్వం ఇతర కంపెనీలను కాదని జిందాల్ గ్రూప్ సంస్థలకు అమరకొండ ముంగదంగల్ గనులు అప్పగించాలని సిఫారసు చేసిందని పేర్కొంది.

English summary
The Naveen Jindal Group had allegedly "misrepresented" facts and was shown favour by the Jharkhand Government which dropped other firms from its recommendation for allocation of coal blocks in the state in 2007, the CBI has said in its FIR filed before a court here in Coalgate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X