న్యూఢిల్లీ:
కాంగ్రెసు
పార్టీ
పార్లమెంటు
సభ్యుడు
నవీన్
జిందాల్
సంస్థకు
ప్రయోజనం
చేకూరేలా
నాటి
కేంద్ర
బొగ్గు
శాఖ
సహాయ
మంత్రి
దాసరి
నారాయణ
రావు..
అప్పట్లో
బొగ్గు
శాఖ
కార్యదర్శికి
నోట్
పంపారని
సిబిఐ
పేర్కొంది.
జిందాల్కు
చెందిన
జిందాల్
గ్రూప్
బొగ్గు
మంత్రిత్వ
శాఖకు
తప్పుడు
సమాచారం
ఇచ్చిందని
బొగ్గు
కుంభకోణం
కేసు
దర్యాఫ్తు
చేస్తున్న
సెంట్రల్
బ్యూరో
ఆఫ్
ఇన్వెస్టిగేషన్(సిబిఐ)
వెల్లడించింది.
ఈ
కుంభకోణంపై
సిబఐ
కోర్టుకు
12వ
ఎప్ఐఆర్ను
సమర్పించింది.
గనుల
కేటాయింపు,
ప్లాంట్ల
ఏర్పాటు
తదితరాలపై
జిందాల్
తప్పుడు
సమాచారం
ఇచ్చిందని
ఎఫ్ఐఆర్లో
పేర్కొంది.
ఆ
కంపెనీకి
గతంలో
కేటాయించిన
గనుల
పైనా
సరైన
సమాచారం
ఇవ్వలేదని,
అలాంటి
సంస్థకు
ప్రయోజనం
చేకూరేలా
నాటి
మంత్రి
దాసరి..
బొగ్గు
శాఖ
కార్యదర్శికి
నోట్
పంపారని
అందులో
సిబిఐ
పేర్కొంది.
బొగ్గు
మంత్రిత్వ
శాఖకు
తప్పుడు
సమాచారం
ఇచ్చినా..
స్క్రీనింగ్
కమిటీ
వాటికే
గనులు
కేటాయిస్తూ
జాబితా
రూపొందించిందని
తెలిపింది.
అమరకొండ
గనులను
జిందాల్కు
ఇవ్వాలన్న
ప్రతిపాదనను
విద్యుత్
మంత్రిత్వ
శాఖ
వ్యతిరేకించిందని
పేర్కొన్నారు.
కాగా
సిబిఐ
తాజా
ఎఫ్ఐఆర్లో
నవీన్
జిందాల్కు
చెందిన
రెండు
సంస్థలను
నిందితులుగా
పేర్కొంది.
జార్ఖండ్
ప్రభుత్వం
కూడా
జిందాల్కు
అనుకూలంగా
వ్యవహరించిందని
తెలిపింది.
2007లో
రాష్ట్ర
ప్రభుత్వం
ఇతర
కంపెనీలను
కాదని
జిందాల్
గ్రూప్
సంస్థలకు
అమరకొండ
ముంగదంగల్
గనులు
అప్పగించాలని
సిఫారసు
చేసిందని
పేర్కొంది.
The Naveen Jindal Group had allegedly "misrepresented" facts and was shown favour by the Jharkhand Government which dropped other firms from its recommendation for allocation of coal blocks in the state in 2007, the CBI has said in its FIR filed before a court here in Coalgate.
Story first published: Tuesday, July 2, 2013, 9:53 [IST]