కొణతాలకు పుండు మీద కారం: సమన్వయకర్తగా దాడి

దాడితో కలిసి పని చేసే ప్రసక్తే లేదని కొణతాల ఇప్పటికే చెప్పారు. కొణతాల అసంతృప్తిని పక్కన పెట్టి దాడిని పార్టీలోకి చేర్చుకున్న అధిష్టానం ఆయనకు పుండు మీద కారం చల్లినట్లుగా మరో ఝలక్ ఇచ్చిందనే చెప్పవచ్చు. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు పంచాయతీ ఎన్నికల కోసం సమన్వయకర్తగా నియమించింది. అదే సమయంలో కొణతాల రామకృష్ణకు మాత్రం ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదని సమాచారం.
దాడి చేరిక తర్వాత అసంతృప్తితో ఉన్న కొణతాల వర్గం పార్టీ తమకు సరైన గుర్తింపునివ్వడం లేదని ఆందోళన చెందుతోందట. తాజాగా దాడిని సమన్వయకర్తగా నియమించడం పట్ల కొణతాలతో పాటు ఆయన వర్గం ఆగ్రహంగా ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications