పార్లమెంటు: కొనసాగుతున్న వాయిదాల పర్వం

Lok Sabha adjourned till noon
న్యూఢిల్లీ: విభజన సెగ కారణంగా పార్లమెంటు సమావేశాల్లో వాయిదాల పర్వం ఐదో రోజైన సోమవారం కొనసాగుతోంది. ఈ రోజు పదకొండు గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ సభ్యులు సభలో నిరసన తెలిపారు.

కాంగ్రెసు ఎంపీలు ప్లకార్డు పట్టుకొని సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలంటూ తెలుగుదేశం పార్టీ సభ్యులు నిరసనలు తెలిపారు. రాజ్యసభలో టిడిపి సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్‌లు వెల్‌లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు.

విభజన సెగ నేపథ్యంలో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ మొదట పదిహేను నిమిషాలు వాయిదా పడింది. ఆ తర్వాత ప్రారంభమైనా సభ్యుల నినాదాలు చేశారు. మరోవైపు ప్రతిపక్ష సభ్యులు జమ్ముకాశ్మీర్‌లోని కిష్టావర్ జిల్లాలో చోటు చేసుకున్న అల్లర్ల ఘటనపై చర్చకు పట్టుబట్టారు.

ఇటు విభజన, అటు అల్లర్ల కోసం చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో చైర్మన్ రాజ్యసభను రెండోసారి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు. లోకసభలో ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించి, ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకోవడంతో స్పీకర్ పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+