బాలుడి దారుణ హత్య: పెట్రోల్ పోసి నిప్పంటించారు
తిరుపతిలోని సత్యనారాయణపురానికి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగి మునిరత్నం రెడ్డి, అరుణ దంపతుల కుమారుడు మురళి(9) శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి ఆడుకోవడానికి బయటికెళ్లాడు.
రాత్రి 10 గంటలు దాటినా మురళి తిరిగి ఇంటికి రాకపోవడంతో మునిరత్నం రెడ్డి తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా, శనివారం ఉదయం ముళ్లపొదల మాటున కాటున కాలిన మృతదేహాన్ని గుర్తించారు.
ఇది ఇలా ఉండగా ప్రకాశం జిల్లాలోని టంగుటూరులో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై చెంచు రామయ్య, నాగూరు అనే ఒప్పంద కార్మికులు మృతి చెందారు.
మృతదేహం మెడలో ఉన్న తాయిత్తు, కుడిచేతికి ఉన్న రాగి కడియం ఆధారంగా ఆ మృతదేహం మురళిదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వి వైద్య కళాశాలకు తరలించారు. చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.