సత్యసాయి కంటే ముందే వచ్చి నేలపై అబ్దుల్ కలాం, కుర్చీ వేయించిన బాబా
అనంతపురం: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పుట్టపర్తిని సందర్శించారు. భారతీయ ఆధ్యాత్మిక గురువుగా ఖండాంతర ఖ్యాతి గాంచిన సత్యసాయి బాబా అంటే కలాంకు అభిమానం. అందువల్ల కలాంకు వీలు చిక్కినప్పుడు సత్యాసాయి బాబాను చూడటానికి పుట్టపర్తి వెళ్లేవారు.
తాను రాష్ట్రపతి హోదాలో ఉన్నప్పుడు సాయిబాబా 81వ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. శాస్త్రవేత్త, పైగా రాష్ట్రపతి హోదాలో ఉన్న అబ్దుల్ కలాం.. సాయిబాబాను కలుసుకోవడంపై పలు విమర్శలు వచ్చాయి.
అయితే, ఆ వేడుకల సందర్భంగా రెండు రోజులపాటు పుట్టపర్తిలోనే ఉన్న అబ్దుల్ కలాం పట్ల సాయిబాబా అత్యంత ఆదరాభిమానాలు కురిపించారు. తనతో సమానంగా ఆసనం వేయించి గౌరవించారు. అయితే, ఒక ఉదయం పుట్టపర్తిలోని సభామందిర ప్రాంగణం సాయికుల్వంత్ హాలుకు సత్యసాయిబాబా చేరుకోవడానికి ముందే కలాం వచ్చారు.

కలాం కుర్చీలో కాకుండా నేల పైన కూర్చున్నారు. అక్కడున్న విద్యార్థుల్లో విద్యార్థిగా కలసిపోయారు. దీనిని గుర్తించిన సాయి సేవకులు, ఇతర భద్రతా సిబ్బంది కుర్చీలో కూర్చోవాలని కోరారు. వద్దని చెప్పారు. దిండ్లు ఇచ్చినా వద్దన్నారు.
అక్కడకు వచ్చిన సత్యసాయి బాబా... కలాం నేల పైన కూర్చోవడం చూసి తన వద్దకు పిలిపించుకొని, తన పక్కనే ఆసనం వేయించి కూర్చోబెట్టుకున్నారు. అబ్దుల్ కలాం కేరళలోని ఇస్రోలో పని చేసిన సమయంలో సాయంత్రం ఐదున్నర దాటితే అధికారిక వాహనం వాడే వారు కాదట.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications