సత్యసాయి కంటే ముందే వచ్చి నేలపై అబ్దుల్ కలాం, కుర్చీ వేయించిన బాబా
అనంతపురం: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పుట్టపర్తిని సందర్శించారు. భారతీయ ఆధ్యాత్మిక గురువుగా ఖండాంతర ఖ్యాతి గాంచిన సత్యసాయి బాబా అంటే కలాంకు అభిమానం. అందువల్ల కలాంకు వీలు చిక్కినప్పుడు సత్యాసాయి బాబాను చూడటానికి పుట్టపర్తి వెళ్లేవారు.
తాను రాష్ట్రపతి హోదాలో ఉన్నప్పుడు సాయిబాబా 81వ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. శాస్త్రవేత్త, పైగా రాష్ట్రపతి హోదాలో ఉన్న అబ్దుల్ కలాం.. సాయిబాబాను కలుసుకోవడంపై పలు విమర్శలు వచ్చాయి.
అయితే, ఆ వేడుకల సందర్భంగా రెండు రోజులపాటు పుట్టపర్తిలోనే ఉన్న అబ్దుల్ కలాం పట్ల సాయిబాబా అత్యంత ఆదరాభిమానాలు కురిపించారు. తనతో సమానంగా ఆసనం వేయించి గౌరవించారు. అయితే, ఒక ఉదయం పుట్టపర్తిలోని సభామందిర ప్రాంగణం సాయికుల్వంత్ హాలుకు సత్యసాయిబాబా చేరుకోవడానికి ముందే కలాం వచ్చారు.

కలాం కుర్చీలో కాకుండా నేల పైన కూర్చున్నారు. అక్కడున్న విద్యార్థుల్లో విద్యార్థిగా కలసిపోయారు. దీనిని గుర్తించిన సాయి సేవకులు, ఇతర భద్రతా సిబ్బంది కుర్చీలో కూర్చోవాలని కోరారు. వద్దని చెప్పారు. దిండ్లు ఇచ్చినా వద్దన్నారు.
అక్కడకు వచ్చిన సత్యసాయి బాబా... కలాం నేల పైన కూర్చోవడం చూసి తన వద్దకు పిలిపించుకొని, తన పక్కనే ఆసనం వేయించి కూర్చోబెట్టుకున్నారు. అబ్దుల్ కలాం కేరళలోని ఇస్రోలో పని చేసిన సమయంలో సాయంత్రం ఐదున్నర దాటితే అధికారిక వాహనం వాడే వారు కాదట.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications