విజయవాడ:ఎసిబి వలలో పొల్యూషన్ బోర్డ్ ఈఈ...భారీగా అక్రమాస్తులు గుర్తింపు
విజయవాడ :ఎసిబి వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా అనూహ్య దాడులతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఏసీబీ తాజాగా మరో అక్రమార్కుడి ఆటకట్టించింది.
ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారని అభియోగాలతో విజయవాడ కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ కార్యాలయ ఈఈ సత్యనారాయణ ఇంట్లో బుధవారం ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో రాజమండ్రి, హైదరాబాద్, నెల్లూరు లో సహా మొత్తం ఏడు చోట్ల దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో ఎసిబి అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించినట్లు సమాచారం.

హైదరాబాద్ మాతృశ్రీ నగర్ లో నివాసం ఉంటున్న సత్యనారాయణ కుమారుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పవన్ కుమార్ ఇంటిలో సోదాలు చేసి 5 కిలోల వెండి తో పాటు విలువైన డాక్యూమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే విజయవాడ, రాజమండ్రిలోని సత్యనారాయణ ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రూ.20 కోట్ల ఆస్తులను గుర్తించారు.
సత్యనారాయణ, అతని కుటుంబ సభ్యుల పేరిట 6 ఇళ్లు, 4 ఫ్లాట్లు, 4.44 ఎకరాల స్థలం,8.51 లక్షల నగదు, 52 లక్షల ఎఫ్డిలు, 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, 250 గ్రాముల బంగారం, 2 కిలోల వెండిని గుర్తించారు. మరో రెండు బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందని ఎసిబి అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications