విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పనితీరు బాగాలేదా: బాబు 'రిజైన్' వ్యాఖ్యలతో అఖిల కలత! ఊహించని నిర్ణయం తీసుకుంటారా?

బోటు ప్రమాదం విషమయై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహచర మంత్రులు, అధికారుల ఎదుటే పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాబు వ్యాఖ్యలపై ఆమె కలత చెందారని తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Akhila Priya Resignation on Boat mishap : బాబు రాజీనామా చెయ్యమన్నారా ?

అమరావతి: బోటు ప్రమాదం విషమయై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహచర మంత్రులు, అధికారుల ఎదుటే పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాబు వ్యాఖ్యలపై ఆమె కలత చెందారని తెలుస్తోంది.

చదవండి: అఖిలప్రియకు షాక్, బోటు ప్రమాదంపై చంద్రబాబు సంచలనం

అనుకోకుండా ప్రమాదాలు జరుగుతాయని, కానీ నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగితే గతంలో రాజీనామాలు చేసేవారని కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బాబు వ్యాఖ్యల నేపథ్యంలో అఖిల ఏం చేయనున్నారనే చర్చ సాగుతోంది.

చదవండి: నంది అవార్డ్, మరో ఆసక్తికరం: జూ ఎన్టీఆర్‌ను పక్కనపెట్టిన లోకేష్! కావాలనే చేశారా?

ఆ శాఖలో ఏం జరుగుతుందో కూడా దృష్టి పెట్టడం లేదా

ఆ శాఖలో ఏం జరుగుతుందో కూడా దృష్టి పెట్టడం లేదా

మంత్రి అఖిలప్రియ తన శాఖలో ఏం జరుగుతుందో కూడా దృష్టి పెట్టడం లేదనే వాదనలు ఉన్నాయి. ఇటు మంత్రి, అటు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నదనేది చంద్రబాబు అభిప్రాయంగా కనిపిస్తోందని అంటున్నారు. అందుకే ఆయన అంత తీవ్ర వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు.

సహనం కోల్పోయి, ఆగ్రహం

సహనం కోల్పోయి, ఆగ్రహం

బోటు ప్రమాదం ఘటనలో 22 మంది చనిపోయారు. అందులో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. పైగా శాఖపై మంత్రికు పట్టు లేదని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో చాలా రోజుల తర్వాత చంద్రబాబు సహనం కోల్పోయి, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. చంద్రబాబు ఆగ్రహం నేపథ్యంలో అఖిలప్రియ ఊహించని నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ సాగుతోంది.

రాజీనామా ట్విస్ట్

రాజీనామా ట్విస్ట్

ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గతంలో రాజీనామా చేసేవారని చంద్రబాబు పరోక్షంగా ఆమెను కూడా రాజీనామా చేయమన్నారని కొందరు భావిస్తుంటే, అలా ఏమీ కాదని, సీరియస్‌గా తీసుకోవాలని, అంత బాధ్యతతో మెలగాలని గట్టి వార్నింగ్ ఇచ్చారని మరికొందరు అంటున్నారు. ఆమె పని తీరు బాగా లేదా అనే చర్చ సాగుతోంది.

మిగతా మంత్రులకు హెచ్చరిక

మిగతా మంత్రులకు హెచ్చరిక

అఖిలప్రియపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఆమె ఒక్కరికే వర్తించినట్లు కనిపించినప్పటికీ మిగతా మంత్రులకు కూడా ఇది గట్టి హెచ్చరిక అని భావిస్తున్నారు. 22 మంది మృతి చెందడంతో ఆగ్రహంతో చంద్రబాబు అలా మాట్లాడారని అంటున్నారు. రాజీనామా చేయమని చెప్పనప్పటికీ ఆ స్థాయిలో మాట్లాడటంపై చర్చ సాగుతోంది.

English summary
AP Chief Minister Nara Chandrababu Naidu has warned Tourism Minister Akhila Priya over boat tragedy on Monday. What she will do?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X