ఆనం వివేకానంద రెడ్డి కొత్త అవతారం..!
ఐతే ఇప్పుడు తాజాగా ఆయన గాయకుడిగా అవతారం ఎత్తారు. గురువారం నాడు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నెల్లూరులో భక్తిపాటలను పాడారు. నెల్లూరులోని మూలపేట శ్రీ మూలస్ధానేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన ఆయన అక్కడి భక్తులతో కలిసి పాటలు పాడారు.
బాగా అనుభవం ఉన్న సింగర్స్ మాదిరి పాటలు పాడి అక్కడున్న వారిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆనం పాడిన భక్తి పాటలు వింటూ భక్తులు ఆయనకు తోడుగా గొంతు కలిపారు. గురువారం నాడు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డికి బారాషాహిద దర్గా దగ్గర చేదు అనుభవం ఎదురైంది.
రొట్టెలపండుగకు వెళ్తుండగా పోలీసులు ఆనం వాహనాన్ని అడ్డుకున్నారు. సాధారణ పార్కింగ్ ప్రాంతంలో వాహనాన్ని ఉంచవలసిందిగా సూచించారు. దీంతో పోలీసులతో ఆనం వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు ఆనం వాహనాన్ని లోనికి అనుమతించడంతో వివాదం సర్దుమణిగింది. బారాషాహిద్ దర్గాలో ఆనం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.